NRPT: నారాయణపేట పట్టణంలో దొంగతనాల నివారణే లక్ష్యంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం బస్టాండ్, ప్రధాన కూడళ్లలో అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను ఆధునిక పరికరాలతో తనిఖీ చేశారు. ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వెంకటేశ్వర్లు సూచించారు.