PDPL: రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 9 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 9,10,044 విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలను ఆదుకుంటామన్నారు.