KMM: పంజాబ్ రాష్ట్రంలో గిడ్డంగుల సంస్ధ బోర్డు సభ్యులతో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం సమావేశమయ్యారు. గోదాముల నిర్వహణతో పాటు పలు అంశాలపై అక్కడి గోదాముల అధికారులతో చర్చించినట్లు రాయల తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమంలో రాయల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యండి కోర్రా లక్ష్మి, జనరల్ మేనేజర్స్ పాల్గొన్నారు.