WNP: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాచలం కోరారు. వనపర్తిలో మంగళవారం ఏర్పాటు చేసిన టీఎస్ యూటీఎఫ్ 5వ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యను రక్షించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. టీచర్ల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, నాలుగు పెండింగ్ డీఎలను విడుదల చేయాలని కోరారు.