NRML: కడెం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారానిపై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను పరీక్షించేందుకు మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.