MHBD: గార్ల మండలంలోని పాకాల చెక్ డ్యాంపై వస్తున్న వరద ఉధృతిని DSP తిరుపతిరావు బుధవారం పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదలు తగ్గే వరకు ఏటి పరిసరాలకు, చెక్ డ్యాం పైకి ఎవరు వెళ్ళవద్దని, సెల్ఫీలు దిగవద్దని ప్రజలను కోరారు. రాకపోకలను నియంత్రించాలని పోలీసులకు ఆదేశించారు.