WGL: వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం దుగ్గొండి సీఐ సాయిరమణ తెలిపారు. దుగ్గొండి సర్కిల్ పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపూర్ మండలాల ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు వర్షాల సమయంలో వ్యవసాయ పనులు, చేపలు పట్టడం, పశువులను తీసుకొని వాగులు దాటవద్దని, సురక్షితంగా ఉండాలని కోరారు.