KMM: కూసుమంచి లోని పశు ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేస్తున్న నరేంద్ర గుండెపోటుతో మృతి చెందిన సంఘటన బుధవారం తాళ్ళగడ్డ తండాలో చోటుచేసుకుంది. తాళ్ళగడ్డ తండాకు చెందిన ఓ రైతు తన పశువు డీలవరీ కోసం పశు వైద్యులకు పోన్ చేయగా తక్షణమే స్పందించిన నరేంద్ర ఆ గ్రామానికి వెళ్ళి పశువుకు వైద్యం చేస్తుండగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.