BHPL: కాటారం మండల కేంద్రంలో సోమవారం PACS, ఆగ్రో సేవా కేంద్రం, DCMS కేంద్రాల ద్వారా రైతులకు యూరియా విక్రయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. కాటారం PACSలో 444, గారెపల్లి ఆగ్రో సేవా కేంద్రంలో 221, గారెపల్లి DCMSలో 222 బస్తాలు విక్రయించారు. పంపిణీని డీఏవో స్వయంగా పర్యవేక్షించారు.