HYD: తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతిలు మహిళా టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక కావడంపై సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. మలేషియా కౌలాలంపూర్ వేదికగా వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్ 19 – మహిళా టీ20 ప్రపంచ క్రికెట్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో వీరిద్దరికీ చోటు దక్కింది. ఈ మేరకు సీఎం ఇరువురిని X ద్వారా అభినందించారు.