PDPL: రామగుండం ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న 350 పడకల ఆసుపత్రి పనులు వచ్చే 10నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం రామగుండంలో నూతనంగా నిర్మాణమవుతున్న ఆసుపత్రి పనులను, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని, రామగుండం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట రామగుండం వైద్యకళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.