NLG: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం శాలిగౌరారం మండల కేంద్రంలో సీఎంఆర్ ఫంక్షన్ హల్లో 106 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.1,06,12,296 చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేదలు కళ్యాణ లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Tags :