KMR: అక్టోబర్ 8న స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం పార్టీ ఆఫీసులో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పు రాకముందే ఎన్నికల విషయంలో ప్రజలను అయోమయ స్థితిలో నెట్టి, గందరగోళానికి గురి చేయడం సరికాదన్నారు.