HYD: కిషన్బాగ్ డివిజన్ పరిధిలో వీధి దీపాల సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఎంఎం పహాడ్ నుంచి పాకీజా హోటల్కు వెళ్లే మార్గంలో పది రోజులుగా అభివృద్ధి దీపాలు వెలగట్లేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాలంటే భయంగా మారింది. వీధి దీపాలు లేక రాత్రిపూట చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగాయని స్థానికులు తెలిపారు. వ్యాపారాలు చేసుకునే వారికి సైతం ఇబ్బందిగా మారింది.