MNCL: బెల్లంపల్లి పట్టణ రైల్వే స్టేషన్లో వికలాంగులు, వృద్ధులు, మహిళల సౌకర్యార్థం ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు చేయాలని మాజీ కౌన్సిలర్లు, ఎంపీ వంశీకృష్ణకి శనివారం వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు బెల్లంపల్లిలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. పట్టణంలోని రాంనగర్ అండర్ బ్రిడ్జి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.