SRD: పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చినట్లు సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఉపేందర్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి నుంచి మొదటి ప్యాకేజీ కింద ఈనెల 27న ఉదయం 6గంటలకు ఎక్స్ ప్రెస్ బస్సు బయలుదేరి వర్గల్ సరస్వతి దేవాలయం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాలను ఒకే రోజు దర్శించుకోవచ్చన్నారు.