GNTR: మంగళగిరి ఎయిమ్స్ భోజనశాలలో తాగునీటి కోసం రోగులు, సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. టేబుల్స్పై జగ్గులు, గ్లాసులు లేకపోవడంతో ఫ్రిజ్ వద్దకు వెళ్లి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాటిల్ లేకపోతే కొనుకోండంటూ నిర్వాహకుల నిర్లక్ష్య సమాధానం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. తాగునీరు అందుబాటులో ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని రోగులు అధికారులను కోరుతున్నారు.