JGL: జగిత్యాలలోని ప్రతి వార్డులో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. 41వ వార్డులో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల కల్పనతోనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.