W.G: యలమంచిలి(M) నారినమెరక గమల్లపేటలో పదో తరగతి లోపు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 18 సంవత్సరాలుగా స్వగ్రామంలో పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో ప.గో. జిల్లా చైర్మన్ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.