NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూరు గ్రామస్తులు, గ్రామ వీడీసీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నేడు తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. తమ పంట పొలాలకు వెళ్లే మార్గంలో కందకం కొట్టారని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు.