MHBD: నర్సింహులపేట పట్టణ కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో శుక్రవారం ఏఈ రణవత్ పాండు మాట్లాడుతూ.. గాలి, వానల సమయంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇళ్లలో, బావుల వద్ద రైతులు విద్యుత్ ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, సమస్య ఏదైనా వస్తే 8712481689ను సంప్రదించాలని తెలిపారు.