HYD: జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఐపీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా పరిధి చర్లపల్లిలోని 58 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువును దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చంచల్ గూడ SP శివకుమార్ గౌడ్ తెలిపారు. ఈ నిర్ణయంతో చెరువు రూపురేఖలు పూర్తిగా మారుతాయని పేర్కొన్నారు. డీజీ సౌమ్య మిశ్రా నిర్ణయం పట్ల హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.