BHNG: మోత్కూర్లో సీఎం సహాయ నిధి చెక్కులను మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గుర్రం కవిత లక్ష్మినర్సింహా రెడ్డి పంపిణీ చేశారు. లబ్దిదారుడు అన్నెపు జ్యోతికి రూ.46,000 విలువైన చెక్కును పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.