సత్యసాయి: హిందూపురం పట్టణంలో స్థానిక ఎంజీఎం మైదానంలో యోగాంధ్ర ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ.. యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభం చేసి నేటితో 30 రోజులు పూర్తి అయిందన్నారు. శనివారం అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమం ఉ. 6 గంటలకు ప్రారంభం అవుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.