KMR: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం బిక్కనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి రాజా గంగారెడ్డి, ఉపాధ్యాయులు, మండల విద్యా వనరుల కేంద్ర సిబ్బంది ఉన్నారు.