NZB: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని భీంగల్ ఎంపీడీవో సంతోష్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన భీంగల్ MPDO కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.