అనంతపురంలోని పీటీసీ గ్రౌండ్లో శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఉదయం 6:30 గంటలకే యోగా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా ప్రజలందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.