KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ ద్వారా ప్రవేశాలకు అడ్మిషన్ల గడువు పెంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే దోస్తు ప్రక్రియ 2 దశలు పూర్తయినందున, మూడో దశ దరఖాస్తు ప్రక్రియను ఈనెల 25 వరకు పొడిగించడం జరిగిందని చెప్పారు. దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తమ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.