కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 45 రోజుల్లోపు కోర్టు కేసులు, ఫిర్యాదులు లేకపోతే ఎన్నికల CCTV ఫుటేజీని తొలగించనున్నట్లు తెలిపింది. ఎన్నికల సరళి దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆయా రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ డేటా 45 రోజుల తర్వాత తొలగించవచ్చని పేర్కొంది.