కృష్ణా: కాలువలు, చెరువుల వెంబడి ఆక్రమణలను గుర్తించి, తొలగించేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ శుక్రవారం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జీఓ నం. 386 ద్వారా నీటి వనరులు, చెరువుల బెడ్లను ఆక్రమణల నుంచి రక్షించేందుకు జిల్లా స్థాయి వాచ్ డాగ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.