CTR: పాలసముద్రం(M) నరసింహాపురం గ్రామానికి చెందిన పాండురంగన్ అదృశ్యమయ్యారని ఆయన భార్య విజయనిర్మల మీడియా ముందు వాపోయారు. గురువారం అర్ధరాత్రి కార్వేటినగరం ఎక్సైజ్ పోలీసులు ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. భర్త ఆచూకీ కోసం తెల్లవారుజాము నుంచి ముగ్గురు కూతుర్లతో వెతికినా ఫలితం లేదన్నారు. ఏడునెలలుగా వేధింపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.