NGKL: చారకొండ మండల కేంద్రంలో శుక్రవారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పర్యటిస్తున్నారు. మండల కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణలో భూమి కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించిన అనంతరం బాధితులతో సమావేశం నిర్వహిస్తారని చారగొండ మండలం బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.