MBNR: మహబూబ్నగర్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 39వ ఎడిషన్ ఒలంపిక్ డే రన్-2025ను మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం స్టేడియం మైదానంలో ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.