KMM: రాష్ట్ర ప్రభుత్వం కల్పించే వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వైద్యురాలు కుసుమ అన్నారు. శుక్రవారం మధిర మండలం మాడుపల్లి ఎస్సీ కాలనీలో వైద్యాధికారి పృథ్వీరాజ్ నాయక్ ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.