కోనసీమ: కాట్రేనికోన మండలం బలుసు తిప్ప గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో 3నెలల నుంచి తాగునీరు రాకపోవడంతో స్థానికులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ..పాలకులు, అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. ఈ సమస్యపై అధికారులకు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరసనకు దిగారు.