SRD: నారాయణఖేడ్ నియోజకవర్గానికి అడ్వాన్స్ ట్రైనింగ్ కళాశాల (ఐటీఐ) మంజూరైనట్లు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గురువారం తెలిపారు. వెనుకబడిన ప్రాంతానికి ఐటీఐ అవసరమని సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల కోరగాన, ఆయన స్పందించి మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రోసిడింగ్ ఆర్డర్ కూడా జారీ చేశారని తెలిపారు. ఐటీఐ మంజూరు చేయడం పట్ల సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.