ఖమ్మం అభివృద్ధిలో భాగంగా ఎఫ్సీఐ గోడౌన్ సమీపంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గురువారం పరిశీలించారు. మెరుగైన రవాణా వ్యవస్థ కోసం చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణీత గడువులోగా మట్టి పనులు పూర్తి చేయాలని సూచించారు.