MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళిక నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. పరిసరాల పరిశుభ్రత, వ్యాధుల నివారణ, వీధుల శుభ్రతపై మున్సిపల్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.