BDK: మణుగూరు మండలం సమితి సింగారం కోడిపుంజుల వాగు వ్యవసాయ క్షేత్రంలో రైతుల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం రైతులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.