JGL: ధర్మపురి మండలం నేరేళ్ల, గోవిందుపల్లె గ్రామాల్లో మున్నూరు కాపు కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఆ సంఘ ప్రతినిధులు విన్నవించారు. మంగళవారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 2 గ్రామాల మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.