ఆదిలాబాద్: సీఆర్టీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ తెలిపారు. మంగళవారం ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో సమ్మె చేస్తున్న సీఆర్టీలను ఆయన కలిసి మద్దతు తెలిపారు. అలాగే వారికి సహాయంగా రూ. పదివేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జైవంత్ రావు, బీఆర్ఎస్వీ అధ్యక్షులు ధరణి రాజేష్, తదితరులు ఉన్నారు.