ADB: విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం పట్టణంలోని ఎస్సీ వసతి గృహంలో వాటర్ ప్లాంట్, గ్రీసర్లను ప్రారంభించి బ్లాంకెట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని, నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.