MNCL: తాండూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వినోద్ ఆదేశాల మేరకు పోగుల భీమేష్ అనే వ్యక్తికి మంజూరైన 21 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసా బుధవారం అందజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.