మంచిర్యాల జిల్లా చెన్నూర్ MLA గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం CM రేవంత్ రెడ్డి, గవర్నర్లు వివేక్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా తండ్రి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తూ, పేదలకు అందుబాటులో ఉంటా’ అని మంత్రి అన్నారు.