NZB: సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ఈనెల 4, 5 తేదీల్లో జరిగిన వాలీబాల్ లీగ్ క్రీడా పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో సహర్ష్ యాదవ్ టీం ప్రథమ స్థానంలో నిలవగా, పరమేశ్వర టెంట్ హౌస్ టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ముఖ్య అతిథిగా సీసీఎంబీ శాస్త్రవేత్త దినేష్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం మంచిదని ఆయన అన్నారు.