SDPT: హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ నూతన ఎండీ నాగిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డికి మంంత్రి శుభాకాంక్షలు తెలిపారు. టీజీ ఆర్టీసీ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ఆయనకు సూచించారు. పలు అంశాలపై వారు చర్చించారు.