KMM: పరుగు పందెంలో మూడు పథకాలు సాధించిన సత్తుపల్లికి చెందిన కొమ్ము ప్రణీతను ఎమ్మెల్యే రాగమయి సత్కరించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ గురు గోవింద్ స్టేడియంలో జరిగిన 76వ జాతీయ స్కూల్ గేమ్స్ 600మీ, 400మీ.ల పరుగు పందెంలో పాల్గొని రెండు వెండి పథకాలను, 200 మీ.ల పరుగు పందెంలో విజయం సాధించి కాంస్య పథకాన్ని సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు అభినందించారు.