NZB: బోధన్ మున్సిపల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి శనివారం సందర్శించారు. ఆస్తి పన్ను తరహాలో 2017వ సంవత్సరం నుంచి పట్టణ ప్రజల కుళాయి కనెక్షన్లు సైతం ఆన్లైన్లో నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు సూచించారు. ఈ ప్రక్రియలో టెక్నికల్ సమస్యలు ఏర్పడితే సీడీఎంఏకు ఫిర్యాదు చేయాలన్నారు.