NLG: నల్గొండ బాలికల జూనియర్ కళాశాల NSS విద్యార్థులు, స్టాఫ్ నర్సింగభట్ల గ్రామానికి చేరుకొని హై స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించే శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చెన్నుగూడెం సర్పంచ్ శ్రీలత జంగయ్య యాదవ్ ప్రారంభించి, విద్యార్థులకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధారాణి, NSS అధికారులు పాల్గొన్నారు.