SKLM: సారవకోట మండలంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం పర్యటించారు. ఈ మేరకు నౌతల కూడలిలో చిన్నారులు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కేంద్ర మంత్రి దృష్టిని ఆకర్షించింది. వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా చిన్నారులు ర్యాలీ చేపట్టడం కేంద్ర మంత్రిని ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ను ఆపి చిన్నారులతో ముచ్చటించారు.